సిరిసిల్ల మండలాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ సిరిసిల్ల సాధన సమితి జేఏసీ సభ్యులు ఆందోళన చేపట్టారు.
- పరిస్థితి ఉద్రిక్తతం
సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా)
సిరిసిల్ల మండలాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ సిరిసిల్ల సాధన సమితి జేఏసీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య వాహనంపై జేఏసీ సభ్యులు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే జిల్లాను ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు.