కారు ఢీకొని, వ్యక్తి మృత్యువాత | The person killed in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని, వ్యక్తి మృత్యువాత

Apr 15 2016 5:40 PM | Updated on Aug 30 2018 4:07 PM

నల్లగొండ జిల్లా భువనగిరి బైపాస్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు.

నల్లగొండ జిల్లా భువనగిరి బైపాస్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన బొడిగే చంద్రయ్య(65) భువనగిరి వైపు స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి, వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే చనిపోయాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement