వరదల్లో పంట పూర్తిగా ధ్వంసం కావడంతో.. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవల కాలంలో గోదావరికి వచ్చిన వరదల్లో పంట పూర్తిగా ధ్వంసం కావడంతో.. ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఆనందకాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సప్క నాగరాజు మిరప పంట నీట మునిగి ధ్వంసం అయిందని మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.