వైఎస్ హయాంలోనే అభివృద్ధి : టీడీపీ నాయకుడు | tdp leader Admiring ysr in vizianagaram district | Sakshi
Sakshi News home page

వైఎస్ హయాంలోనే అభివృద్ధి : టీడీపీ నాయకుడు

Nov 16 2015 4:57 PM | Updated on Aug 10 2018 9:42 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే తమ గ్రామాలు అభివృద్ధి జరిగాయని విజయనగరం జిల్లా తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్వర్ అన్నారు.

విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే తమ గ్రామాలు అభివృద్ధి  చెందాయని విజయనగరం జిల్లా తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు మండలం కూర్మరాజుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా పరమేశ్వర్ సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో రాజన్నదొర ఎమ్మెల్యేగా వ్యవహరించిన కాలంలోనే తమ గ్రామాభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొరతోపాటు టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి నిధులు రావడం లేదన్నారు. పరమేశ్వర్ వ్యాఖ్యలతో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ సంధ్యారాణితో పాటు టీడీపీ నాయకులు మిన్నుకుండిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement