ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉద్యోగులు మంగళవారం బంద్ పాటించారు.
శ్రీహరికోట : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉద్యోగులు మంగళవారం బంద్ పాటించారు. స్టేషన్ మొదటి గేటు వద్ద బైఠాయించిన యూనియన్ నాయకులు లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు ఈ బంద్కు నేతృత్వం వహించారు. దీంతో స్టేషన్ వద్ద కొనసాగే పనులకు తీవ్ర అంతరాయం కలిగింది.