తణుకు : తణుకు పట్టణ పరిధిలోని తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.
తణుకులో చోరీ
Oct 23 2016 1:33 AM | Updated on Aug 30 2018 5:27 PM
తణుకు : తణుకు పట్టణ పరిధిలోని తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్జీవో కాలనీకు చెందిన బూరుగుపల్లి వెంకటేశ్వరరావు స్థానికంగా ఓ ప్రైవేట్ కర్మాగారంలో ఎలక్రీ్టషియన్గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం నల్లజర్లలో శుభకార్యం నిమిత్తం భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లారు. శనివారం ఉదయం వచ్చి చూసే సరికి ఇంటి తలుపుల తాళాలు పగులకొట్టి ఉన్నాయి. దీంతో కంగారుగా పడక గదిలోకి వెళ్లగా రెండు బీరువాల తలుపులు తెరచి ఉన్నాయి. బీరువాలోని తొమ్మిదిన్నర కాసుల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు రూ.25 వేల నగదును దుండగులు అపహరించారు. ఈ సంఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జి.శ్రీనివాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement