అమ్మ ఒడికి మతిస్థిమితం లేని యువతి | mentally disordered woman reached to amma odi | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడికి మతిస్థిమితం లేని యువతి

Sep 30 2016 12:08 AM | Updated on Oct 16 2018 4:50 PM

యువతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు  తెలుసుకొంటున్న ఏపీడీ నాగశైలజ తదితరులు - Sakshi

యువతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకొంటున్న ఏపీడీ నాగశైలజ తదితరులు

అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని తిరుపతికి చెందిన ఓ యువతిని చిత్తూరు అమ్మ ఒడి కేంద్రానికి తరలిస్తున్నట్లు ఐసీడీఎస్‌ ఏపీడీ నాగశైలజ తెలిపారు.

చౌడేపల్లె: అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని తిరుపతికి చెందిన ఓ  యువతిని చిత్తూరు అమ్మ ఒడి కేంద్రానికి తరలిస్తున్నట్లు ఐసీడీఎస్‌ ఏపీడీ నాగశైలజ  తెలిపారు. గురువారం ఐసీడీఎస్‌ సీడీపీవో సరస్వతితో కలిసి ఆమె పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించారు. ఈ నెల 27వ తేదీ రాత్రి ఆ యువతితో ఆటోడ్రైవర్లు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ యువతిని చిత్తూరు అమ్మ ఒడికి తరలించి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట ఏసీడీపీవో వాణిశ్రీదేవి, సూపర్‌వైజర్లు నాగరత్న, మాధవీలత తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement