
కడప మేయర్ గృహ నిర్బంధం
కడప బంద్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్లతో పాటు గృహ నిర్బంధం కొనసాగుతోంది.
కడప : కడప బంద్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్లతో పాటు గృహ నిర్బంధం కొనసాగుతోంది. నారాయణ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ బుధవారం కడప నగరం బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే పలువురు పార్టీ నాయకులను అరెస్ట్ చేసి, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మరోవైపు కడప వాసులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చిన బంద్కు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. కాగా బంద్ను విఫలం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.