వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్కౌంటర్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్కౌంటర్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పోస్టుమార్టం నివేదికను తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన పోస్టుమార్టంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. దాంతో ఎన్కౌంటర్కు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ను నిపుణులకు పంపిస్తామని హైకోర్టు పేర్కొంది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.