ఆదివాసీల అస్థిత్వ పోరాటం
శతాబ్దాల కాలంగా ఆది వాసీలు అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉన్నా రు. సమ్మక్క–సారలమ్మల దగ్గర నుంచి కొమరంభీమ్, బిల్లు తదితరులు తిరుగుబాట్లు చేసి నా ప్రతీ సందర్భంలోనూ వారి జీవనం, సంస్కృతిపై విధ్వంసం కొనసాగుతూనే వస్తోం ది.
-
గిరిజన జీవన విధ్వంసంపై విద్యార్థి అధ్యయనం
హన్మకొండ కల్చరల్ : శతాబ్దాల కాలంగా ఆది వాసీలు అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉన్నా రు. సమ్మక్క–సారలమ్మల దగ్గర నుంచి కొమరంభీమ్, బిల్లు తదితరులు తిరుగుబాట్లు చేసి నా ప్రతీ సందర్భంలోనూ వారి జీవనం, సంస్కృతిపై విధ్వంసం కొనసాగుతూనే వస్తోం ది. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె.సీతారామరావు వద్ద పరిశోధన చేస్తున్న తాడ్వా యి మండలంలోని కామారం గ్రామానికి చెందిన ఆదివాసీ విద్యార్థి మైపతి అరుణ్కుమార్ వెలువరించిన ‘ఆదివాసీ జీవన విధ్వం సం’ పుస్తకంలో వీటన్నిటినీ చర్చించారు.
జాతీయవాదాలకు, జాతుల పేరిట ఏర్పడిన రాజ్యాల స్వభావాలకు ఆదివాసీల జీవన విధానం అతీతమైనది. వారు సమష్టి జీవనసౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అడవిపై ఆదివాసీలదే హక్కు అన్నది నినాదం. అలాంటి న్యాయమైన హక్కు చరిత్రలో ఏనాడూ అంగీకరించబడలేదు. ఫలితంగానే సమ్మక్క–సారలమ్మలు, 1778లో పహడీయాలు, 1803లో కోయకొండరెడ్లు, 1852, 1885లో సంతాల్లు, 1836 నుంచి పదేండ్లపాటు రాంజీగొండు, 1857లో వీరనారాయణసింగ్, 1924లో ఘంటందొర, మల్లుదొరలు, 1928 నుంచిlపన్నెండు సంవత్సరాలు కొమరంభీమ్, బిల్లు తదితరులు ఎన్నోచోట్ల తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ ఆదివాసీల హద్దులను అతిక్రమించి వారిపై దాడులు చేయడం.. వారి భూములను లాక్కోవడం.. కులవ్యవస్థ బ్రాహ్మణీకరణలోకి లాగాలని చూసేవారు. ఒకవైపు మతమార్పిడికి ప్రలోభపెడుతున్న మిషినరీలు.. మరోవైపు వారి సంస్కృతిని ధ్వంసం చేయడం మాత్రం ఆగిపోలేదు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంలో జాతిపరంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లను ఏర్పా టు చేస్తున్న సమయంలో ఆదివాసీలకు కూడా ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష చర్చకు వచ్చింది. దానిని హోంమంత్రి పటేల్, ప్రధాని నెహ్రూలు తిరస్కరించడంతో అది వీగిపోయింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలోనూ ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నినాదం ముందుకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆదివాసీలు జనాభా పరంగా తగ్గిపోతూ మరోవైపు ఏలాంటి ప్రాధాన్యత లేకుండా పోవడం వారి సంస్కృతి పరమైన సమ్మక్క –సారలమ్మ జాతర వంటివి సైతం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవడం వారిని కృంగదీస్తున్నాయి.
ప్రత్యేక రాష్ట్రంతో అభివృద్ధి
ఆదివాసీలకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందే.. ఆదివాసీ తెగలను ఏ,బీ,సీ,డీలుగా వర్గికరిస్తే విద్య, ఉద్యోగ, రాజకీయరంగాలలో అభివృద్ధి చెందుతారు.. లేదంటే ఆదివాసీల దుర్భర జీవితాలకు ముగింపు ఉండదని అరుణ్కుమార్ తన పుస్తకంలో ప్రతిపాదించారు. ఇందులో ఆదివాసీల జీవన విధానాన్ని ఉద్యమ స్వభావంతో అధ్యయనం చేసిన కొమరంభీమ్ నవలారచయిత అల్లం రాజయ్య రాసిన 18 పేజీల ముందుమాట, అరుణ్కుమార్ తన క్షేత్రప్రయాణం గురించి రాసిన 10 పేజీలు విలువైనవి. ఆదివాసీలపై విసృతంగా అధ్యయనంచేసి వారి స్వయంపాలన ఉద్యమాని కి ఊపిరిపోసిన దివంగత ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావుకు ఈ పుస్తకం అంకితమిచ్చారు. ఈ పుస్తకం వెల రూ.250, కావలసిన వారు 94419 66756 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు.
క్షేత్ర పర్యటన నేపథ్యం
విశాఖపట్నం జిల్లాలో 2007 ఆగస్టు 20న నక్సలైట్ల వేటకు వెళ్లిన గ్రేహౌండ్స్ దళాలు వాకపల్లి గ్రామంలోని ఖొందు ఆదివాసీల ఇళ్లపై దాడిచేసి మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ వార్త అప్పట్లో సంచలనం కలిగించింది. బాధిత మహిళలు హైదరాబాద్కు వచ్చి హోంమంత్రికి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించినప్పటికీ నిందితులకు శిక్షపడలేదు. పైగా బాధిత మహిళలు అవహేళనలకు గురయ్యారు. ఆదివాసీ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా ఉన్న అరుణ్ ఈ సంఘటనతో చలించిపోయారు. వారికి బాసటగా నిలువాలనుకుని వివిధ ప్రాంతాలలో ఆదివాసీల చరిత్ర సంస్కృతి, జీవితాలపై అధ్యయనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. 2012 ఏప్రిల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్రకార్యదర్శి దబ్బగట్ల సుమన్, వరంగల్ జిల్లా బాధ్యులు కుంజ కృష్ణప్రసాద్, నాలి సారయ్య, జిల్లా అధ్యక్షులు ఈసం సుధాకర్లతో కలిసి అప్పటి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో క్షేత్రపర్యటన ద్వారా అధ్యయనం చేశారు. తాను తెలుసుకున్న విషయాలకు జతచేసి ‘ఆదివాసీ జీవన విధ్వంసం’ పుస్తకంగా వెలువరించారు.