ధాన్యం కొనుగోలుపై విచారణ | enquiry on rice buying | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలుపై విచారణ

Oct 6 2016 10:28 PM | Updated on Sep 4 2017 4:25 PM

ధాన్యం కొనుగోలుపై విచారణ

ధాన్యం కొనుగోలుపై విచారణ

కామవరపుకోట : వెలుగు ఆధ్వర్యంలో 2014–15 సంవత్సరంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణాధికారి కె.రవీంద్రబాబు, డీపీఎం (మార్కెటింగ్‌) గురువారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో విచారణ నిర్వహించారు.

కామవరపుకోట : వెలుగు ఆధ్వర్యంలో 2014–15 సంవత్సరంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణాధికారి కె.రవీంద్రబాబు, డీపీఎం (మార్కెటింగ్‌) గురువారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఈ విషయమై ఏప్రిల్‌ 13న వైకేవీ అప్పారావు, డీపీఎం (ల్యాండ్‌), కె.రవీంద్రబాబు ఓసారి విచారణ నిర్వహించారు. విచారణలో రూ.25 లక్షలు దుర్వినియోగమయినట్టు నిర్ధారించారు. అయితే అసలు దోషులను వదిలిపెట్టి ఉద్యోగులను బాధ్యులను చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరలా విచారణ నిర్వహ/æంచారు. పక్కా రికార్డులు, ఆధారాలతో రావాలంటూ 114 మందికి నోటీసులు జారీ చేశారు. 
 
 
 
 

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement