దేవాదాయ భూమి స్వాధీనం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో కామవరపుకోట మండలంలో రావికంపాడు గ్రామంలోని సీతారామస్వామి దేవస్థానానికి చెందిన ఆక్రమణలో ఉన్న 283 సర్వే నెంబర్లోని 1.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో కామవరపుకోట మండలంలో రావికంపాడు గ్రామంలోని సీతారామస్వామి దేవస్థానానికి చెందిన ఆక్రమణలో ఉన్న 283 సర్వే నెంబర్లోని 1.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అన్యాక్రాంతంలో ఉన్న ఈ భూమికి గత నెల 22న బహిరంగ వేలం నిర్వహించగా మేన్ని రాంబాబు అనే వ్యక్తి హెచ్చుపాటకు పాడుకున్నారని పేర్కొన్నారు. కాకినాడ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ తహసీల్దార్, సర్వేయర్, కామవరపుకోట మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి పాల్గొన్నారని తెలిపారు.