ఆరు రోజులుగా ఏడు లక్షల మంది | comming to sixdays sevenlakh people | Sakshi
Sakshi News home page

ఆరు రోజులుగా ఏడు లక్షల మంది

Aug 18 2016 1:12 AM | Updated on Sep 4 2017 9:41 AM

ఆరు రోజులుగా ఏడు లక్షల మంది

ఆరు రోజులుగా ఏడు లక్షల మంది

పుష్కరాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. జిల్లాలో 28 స్నానఘాట్లు ఏర్పాటు చేయగా భక్తులు అత్యధికంగా నాగార్జునసాగర్‌కు తరలి వస్తున్నారు.

నాగార్జునసాగర్‌ : పుష్కరాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. జిల్లాలో 28 స్నానఘాట్లు ఏర్పాటు చేయగా భక్తులు అత్యధికంగా నాగార్జునసాగర్‌కు తరలి వస్తున్నారు. ఎక్కువగా శివాలయం ఘాట్‌లోనే స్నానం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడ రద్దీ పెరగడంతో పోలీసులు కొంత మేరకు భక్తులను సురికివీరాంజనేయస్వామి ఘాట్‌తోపాటు ఊట్లపల్లి గాట్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం సాగర్‌లో ఏర్పాటు చేసిన శివాలయం, సురికిఆంజనేయస్వామి, పొట్టిచెల్మఘాట్లలో ఈ ఆరురోజుల్లో దాదాపు ఏడు లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. కాగా బుధవారం శివాలయం ఘాట్‌ వద్ద 80వేల మంది, సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 34వేల మందితో మెుత్తం 1.14లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement