
నేను 50 వేలు టిప్పిస్తే వద్దన్నాడు: బాబు
సింగపూర్ డ్రైవర్కు టిప్పుగా తాను 50 వేలు ఇస్తే అతడు తిరస్కరించాడని, సింగపూర్లో అవినీతి ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ: సింగపూర్లో ఓ డ్రైవర్కు టిప్పుగా తాను రూ. 50 వేలు ఇస్తే అతడు తిరస్కరించాడని, సింగపూర్లో అవినీతి ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విజయవాడలోని ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హెరిటేజ్ సంస్థ రూ. 2,500 కోట్ల వ్యాపారం చేస్తోందన్నారు. ఈ ఏడాది హెరిటేజ్కు 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. రాజకీయాలకు లోకేష్ను ఒక వారసత్వంగా చంద్రబాబు తెలిపారు. జేబులో డబ్బులు కూడా పెట్టుకోని తనపై అసలు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. పెదబాబు, చినబాబు అంటూ విమర్శిస్తున్నారని వాపోయారు. అయితే, ఇద్దరు సీఎస్లు నీటి పారుదల ప్రాజెక్టుల ఫైలుపై సంతకం పెట్టకపోవడాన్ని మాత్రం చిన్న విషయంగా ఆయన కొట్టిపారేశారు. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రెండో కేబినెట్లో అంకెల సమస్య వస్తే.. దాన్ని కొత్త సీఎస్ సరిచేశారని అన్నారు.
ప్రతిపక్షాలు అనవసరంగా తనపై, తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నాయని చంద్రబాబు వాపోయారు. పార్టీని బలోపేతం చేయడానికి రాజకీయ పునర్వ్యవస్థీకరణ చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నాయకులు వచ్చినప్పుడు కలుపుకొని పోవాలని, గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.