దుద్దుకూరులో భారీ అగ్నిప్రమాదం | 30 thacthed houses burn to fire in devarapally | Sakshi
Sakshi News home page

దుద్దుకూరులో భారీ అగ్నిప్రమాదం

Apr 4 2016 3:28 PM | Updated on Sep 3 2017 9:12 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.

దేవరపల్లి( పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో చెరువుగట్టుపై నిర్మించుకున్న 40 పూరిళ్లు అగ్ని శిలల్లో దగ్ధమైనట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందినట్టు సమాచారం.

లక్షల రూపాయల్లో భారీగా ఆస్తినష్టం వాటిలినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా కట్టుకున్న గూడు కళ్లముందే బూడిద కావడంతో బాధితులంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement