మ‌హిళ‌ల‌ను అర్ధ‌న‌గ్నంగా ఊరేగించిన గ్రామ‌స్థులు | Three Women Thrashed And Tonsured In Muzaffarpur In Bihar | Sakshi
Sakshi News home page

మంత్ర‌గ‌త్తెల‌న్న అనుమానంతో..

May 5 2020 12:07 PM | Updated on May 7 2020 10:55 AM

Three Women Thrashed And Tonsured In Muzaffarpur In Bihar - Sakshi

పాట్నా: బిహార్‌లో అమానుష ఘ‌ట‌న జ‌రిగింది. మంత్ర‌గ‌త్తెల‌న్న అనుమానంతో ముగ్గురు మ‌హిళ‌ల‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ముజ‌ఫ‌ర్‌పూర్‌లోని డ‌క్రామా గ్రామంలో ముగ్గురు మ‌హిళ‌ల‌ను గ్రామ‌స్తులు మంత్ర‌గ‌త్తెలుగా భావించారు. వారివ‌ల్ల త‌మ‌కు ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన గ్రామ ప్ర‌జ‌లు అంతా ఏక‌మై వారిపై దాడికి దిగారు. మ‌హిళ‌ల గుండు గీయించి, అర్ధ‌న‌గ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వం ప్ర‌ద‌ర్శించారు. అంతేకాక వారిచేత మూత్రం తాగిస్తూ నీచానికి ఒడిగ‌ట్టారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘ‌‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచార‌ణ జ‌రిపి, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. (అశ్లీల ఫొటోలు షేర్‌ చేసి.. ఆపై..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement