భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Software Employee Suicide In Miyapur - Sakshi

మియాపూర్‌లో ఘటన

టీసీఎస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న మహితి

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌  ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. మదీనగూడా సమీపంలో గల ల్యాండ్మార్క్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే మహితి (28).. తాను నివసిస్తోన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మహితి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top