ఏసీబీ అదుపులో జీహెచ్‌ఎంసీ ఏఈ | GHMC Officer AE Caught While Demanding Bribery | Sakshi
Sakshi News home page

ఏసీబీ అదుపులో జీహెచ్‌ఎంసీ ఏఈ

Feb 2 2019 10:00 AM | Updated on Feb 2 2019 10:00 AM

GHMC Officer AE Caught While Demanding Bribery - Sakshi

నిందితుడు వెంకట్రాములు

సంతోష్‌నగర్‌: కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఏఈ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన కంచన్‌బాగ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. డివిజన్‌ పరిధిలోని సలాల ప్రాంతంలో సబీల్‌ ఉస్‌ సాలం వద్ద సీసీ రోడ్డు వేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్‌ గులాం రిజ్వాన్‌ ఫారూఖీ డివిజన్‌ ఏఈ వెంకట్రాములును కోరాడు. అందుకు అతను రూ.40 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో ఫారూఖీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.  వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం హఫీజ్‌బాబానగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద కాంట్రాక్టర్‌ నుంచి ఏఈ వెంకట్రాములు రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement