లోయలో పడ్డ బస్సు, ఆరుగురు మృతి

Bus falls into deep gorge in Jammu Kashmir  - Sakshi

శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని ఉద్దంపూర్ జిల్లా మజాల్తా సమీపంలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఆరుగురు మృతి చెందగా, మరో 38మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు సురిన్‌సార్‌ నుంచి శ్రీనగర్‌ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస‍్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top