టైర్ల కంపెనీలో అగ్నిప్రమాదం
విశాఖపట్నం జిల్లా : అనకాపల్లి మండలం రేబాక టైర్ల కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కార్మికులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడ్డవారు రేబాక చెందిన కోన మధు, సియాద్రి శ్రీను ,గణేష్, గాజువాక డ్రైవర్స్ కాలనీకి చెందిన గోవింద కుమార్, శ్రీను, గోపీలుగా గుర్తించారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విషయం తెలిసి సంఘటనాస్థలానికి బయలు దేరారు.
మరిన్ని వార్తలు