14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు! | 74 Year Old Man Booked For Molesting !4 Year Girl In Vijayawada District | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

Jul 17 2019 8:55 AM | Updated on Jul 18 2019 7:31 AM

74 Year Old Man Booked For Molesting !4 Year Girl In Vijayawada District - Sakshi

సాక్షి, మధురానగర్‌ (విజయవాడ): బాలికను వృద్ధుడు వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన ఘటన నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్‌నగర్‌కు చెందిన జాన్‌ బాబు(74) అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.

బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు జాన్‌బాబును హెచ్చరించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాక పోగా బాలిక స్కూలుకు వెళ్లే సమయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లి మంగళవారం నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement