దీపావళికి 99 శాతం ప్రజల్ని చేరుకుంటాం | Reliance Jio to cover 99 percent population by Diwali | Sakshi
Sakshi News home page

దీపావళికి 99 శాతం ప్రజల్ని చేరుకుంటాం

Feb 28 2018 12:39 AM | Updated on Feb 28 2018 12:39 AM

Reliance Jio to cover 99 percent population by Diwali - Sakshi

బార్సెలోనా: రిలయన్స్‌ జియో వచ్చే దీపావళి నాటికి దేశంలోని 99 శాతం ప్రజలకు సేవలు అందించే స్థితికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఈ విషయాన్ని జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ జ్యోతింద్ర థాకర్‌ తెలిపారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా శామ్‌సంగ్‌ భాగస్వామ్యంతో కలసి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) సేవలను అందించాలనుకుంటున్నట్టు, ఇది కస్టమర్లు, వ్యాపారులకు సాయంగా ఉంటుందన్నారు.

ప్రతీ నెలా 8,000 నుంచి 10,000 వరకు టవర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి దేశంలో 99 శాతం ప్రాంతాలను కవర్‌ చేయగలమన్నారు. ప్రస్తుతం జియోకి 16 కోట్ల టెలికం చందాదారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement