మళ్లీ పైకి చూస్తున్న పెట్రో ధరలు | Petrol, diesel prices hiked again on Friday | Sakshi
Sakshi News home page

మళ్లీ పైకి చూస్తున్న పెట్రో ధరలు

Jan 18 2019 1:55 PM | Updated on Jan 18 2019 2:08 PM

Petrol, diesel prices hiked again on Friday - Sakshi

సాక్షి, ముంబై : దేశీయంగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులను మురిపించిన ఇంధన ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల  ప్రభావంతో  జనవరి నుంచి  మొదలుపెట్టి వరుసగా శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.  దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 19 పెరిగింది. దీంతో  ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.55కి.. డీజిల్ ధర రూ.64.97కి పెరిగింది.

ముంబై : పెట్రోలు ధర రూ.76.18, డీజిల్ రూ.68.02
చెన్నై: పెట్రోల్‌ రూ.73.23  డీజిల్‌ రూ.68.62
కోలకతా: పెట్రోల్‌ రూ.72.65,  డీజిల్‌ రూ.66.74
హైద‌రాబాద్‌: పెట్రోల్ ధర రూ.74.84, డీజిల్ ధరరూ.70.63  
విజయవాడ : పెట్రోల్‌ రూ.74.64 డీజిల్‌ రూ.70.05 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.87 డాలర్ల వద్ద ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర 9సార్లు, డీజిల్ ధర 10సార్లు పెరిగింది. దీంతో పైసా పైసా పెరుగతూ వస్తున్న ధరలు మళ్లీ పాత స్థితికి  చేరుకుంటూ వుండటంతో వినియోగదారుల గుండెల్లో గుబులు మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement