బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు | Sakshi
Sakshi News home page

బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు

Published Fri, Nov 1 2019 12:05 AM

No proposal to launch gold amnesty scheme - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఎటువంటి క్షమాభిక్ష పథకాన్ని పరిశీలించడం లేదని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెక్కలు చూపని బంగారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ తరహా పథకం ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ ప్రక్రియ ఆరంభమైందని, ఈ ప్రక్రియకు ముందు ఈ తరహా వదంతులు రావడం సహజమేనని పేర్కొన్నాయి. ఓ పరిమితికి మించి లెక్కలు చూపని బంగారం కలిగి ఉన్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి ప్రభుత్వం నిర్దేశించిన పన్ను చెల్లించేలా ఒక పథకం ప్రవేశపెట్టనున్నారని మీడియాలో కథనాలు రావడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement