
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. 40 మంది సీనియర్ ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు ఈ భేటీలో పాల్గొన్నారు. దేశాభివృద్ధి నాలుగేళ్ల కనిష్టానికి పడిపోవడం, ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెడుతుండటం తాజా సమావేశ నేపథ్యం.
వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి, ఆరోగ్యం, విద్య, తయారీ, ఎగుమతులు, పట్టణాభివృద్ధి, మౌలిక వనరుల కల్పన వంటి అంశాలు చర్చల్లో చోటుచేసుకున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.