జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం | Mobile industry to contribute 8.2% to GDP by 2020: Govt report | Sakshi
Sakshi News home page

జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం

Nov 25 2016 1:39 AM | Updated on Sep 4 2017 9:01 PM

జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం

జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2 శాతం

దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు...

2020 నాటికి సాధ్యమన్న ప్రభుత్వ నివేదిక
న్యూఢిల్లీ: దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం, టెలికం శాఖలు సంయుక్తంగా ఓ నివేదికలో తెలిపారుు. ప్రస్తుతం జీడీపీలో ఈ రంగం తోడ్పాటు 6.5 శాతం (140 బిలియన్ డాలర్లు/రూ.9.38 లక్షల కోట్లు)గా ఉందని... 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారుు.  ‘‘2020 నాటికి మొబైల్ ఫోన్ చందాదారుల సంఖ్య 100 కోట్లను దాటుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2014 ఏప్రిల్-2016 మార్చి కాలానికి టెలికం రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.19 బిలియన్ డాలర్లు (రూ.28,000 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement