కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్‌ | Karti Chidambarams Assets Seized In Inx Media Case | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎక్స్‌ కేసు : కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్‌

Oct 11 2018 11:55 AM | Updated on Oct 11 2018 8:41 PM

Karti Chidambarams Assets Seized  In Inx Media Case - Sakshi

కార్తీకి ఈడీ షాక్‌ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో రూ 54 కోట్ల ఆస్తులు అటాచ్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేం‍ద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన సంస్థకు చెందిన భారత్‌, బ్రిటన్‌, స్పెయిన్‌లలో రూ 54 కోట్ల ఆస్తులను ఈడీ గురువారం అటాచ్‌ చేసింది. ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు అనుగుణంగా గత ఏడాది మే 15న కార్తీని చెన్నైలో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశాల నుంచి రూ 305 కోట్ల నిధులు సమకూర్చేందుకు ఎఫ్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్‌ లభించేలా చేసినందుకు కార్తీ చిదంబరం రూ పది లక్షల ముడుపులు స్వీకరించారని ఆరోపించిన సీబీఐ ఆ తర్వాత ఆ మొత్తాన్ని 100 మిలియన్‌ డాలర్లుగా సవరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement