నష్టాల్లో మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమమైనాయి.అమెరికా మార్కెట్ల బలహీనత, ఆర్బీఐ మీట్ నేపథ్యంలో వరుసగా రెండో రోజుకూడా కీలక సూచీలు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 209 పాయింట్లు పతనమై 35,924 వద్ద, నిఫ్టీ 64పాయింట్ల నష్టంతో 10805ద్ద కొనసాగుతున్నాయి. ఫలితంగా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతుస్థాయిల దిగువకు చేరాయి. దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి.
ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ టాప్ లూజర్గా ఉంది. ఇందస్ఇండ్, బ్యాంక్ఆఫ్ బరోడా, ఫెడరల్బ్యాంక్, ఎస్ బ్యాంకు,యాక్సిస్ బ్యాంకు నష్టపోతున్నాయి. అటు టాటామోటార్స్ షేరు 2 శాతం నష్టపోతోంది. దీంతోపాటు హిందాల్కో, టాటా స్టీల్, గ్రాసిం, వేదాంత టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు భారతి ఇన్ప్రా, ఎన్టీపీసీ, అదానీ, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ లాభపడుతున్నాయి.
అటు దేశీయ కరెన్సీ రూపాయిలో వరుస బలహీనత కొనసాగుతోంది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే రూపాయి బుధవారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించింది. 16పైసలు నష్టపోయి 70.64 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. మంగళవారం 70.49 వద్ద ముగిసింది.
మరోవైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండురోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ నేడు పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. కీలక వడ్డీరేట్లను పెంచుతుందా, యథాతథంగా ఉంచుతుంది అనేకి మార్కెట్లకు కీలకం.
మరిన్ని వార్తలు