న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 45వ సదస్సుకు భారత్ నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్-బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితర సీనియర్ కేబినెట్ సహచరులతో పాటు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా పాల్గొననున్నారు. ఈ నెల 20-24 వరకూ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ఈ సదస్సుకు 100 మందికిపైగా భారత కార్పొరేట్ దిగ్గజాలు హాజరుకానుండటం గమనార్హం.
జాబితాలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, టీసీఎస్ సారథి ఎన్. చంద్రశేఖరన్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా, అజీమ్ ప్రేమ్జీ, సునీల్ మిట్టల్, ఉదయ్ కొటక్, ఆది గోద్రెజ్, నవీన్ జిందాల్, బాబా కళ్యాణి వంటి హేమాహేమీలు ఉన్నారు. సదస్సుకు నేతృత్వం(కో-చైర్స్) వహిస్తున్న ఆరుగురిలో భారత్ నుంచి జుబిలంట్ భర్తియా గ్రూప్ కో-చైర్మన్, వ్యవస్థాపకుడు హరి ఎస్. భర్తియా, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిట్ ఉన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పలు కీలక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే ఈసారి సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందుకోసం ‘ద న్యూ గ్లోబల్ కాంటెక్స్ట్’ అనే థీమ్ను ఎంచుకున్నారు. కాగా, భారత్లో వ్యాపారాలు, రాజకీయాలు, సామాజిక పరిస్థితుల్లో కొత్త నాయకత్వం తీసుకొస్తున్న మార్పులపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడే అవకాశం ఉంది. కాగా, సదస్సులో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు.
ప్రపంచ నేతలు, కార్పొరేట్లలో ముఖ్యులు...
జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అద్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, చైనా ప్రధాని లీ కెకియాంగ్, స్విస్ అధ్యక్షుడు సిమెనెటా సొమారుగా, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సహా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన నేతలు హజరవుతున్నారు. మొత్తంమీద 2,500 మందికిపైగా కార్పొరేట్లు, రాజకీయ నాయకులు సందడి చేయనున్నారు. ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్; డబ్ల్యూటీఓ డెరైక్టర్ జనరల్ రాబెర్టో అజెవెడో, అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాహూ సీఈఓ మారిసా మేయర్, ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్బర్గ్ తదితర దిగ్గజాలు హాజరవుతున్నారు.
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ హల్చల్..!
Published Mon, Jan 19 2015 1:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement