రూ.24,000 కోట్లు సమీకరించనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.24,000 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధుల సమీకరణకు గాను బుధవారం జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. హెచ్డీఎఫ్సీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ చేయడం ద్వారా రూ.8,500 కోట్లు సమీకరిస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.
మిగిలిన రూ.15,500 కోట్లను షేర్ల జారీ లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీలు, క్యూఐపీ, ఏడీఆర్/జీడీఆర్ల ద్వారా సమీకస్తామని వివరించింది. వచ్చే నెల 19న జరిగే అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరతామని తెలిపింది.
మరిన్ని వార్తలు