‘ఆ బ్యాంకులను ప్రయివేటీకరించం’ | Arun Jaitley rules out privatisation of public sector banks  | Sakshi
Sakshi News home page

‘ఆ బ్యాంకులను ప్రయివేటీకరించం’

Feb 24 2018 3:58 PM | Updated on Aug 20 2018 4:55 PM

Arun Jaitley rules out privatisation of public sector banks  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో రూ 11,400 కోట్ల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజకీయంగా ఈ చర్య ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ పీఎన్‌బీ స్కాం అనంతరం బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పుకొచ్చారు.

బ్యాంకుల ప్రైవేటీకరణపై విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని, చట్ట సవరణలు ( బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) చేపట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనికి రాజకీయ పార్టీలపై ఒకే వైఖరి అవసరమని, పీఎస్‌యూ బ్యాంకుల ‍ప్రైవేటకీరణకు రాజకీయంగా ఏకాభిప్రాయం కుదిరేపని కాదని అన్నారు. ఇది సవాల్‌తో కూడిన సంక్లిష్ట నిర్ణయమని జైట్లీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement