పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ | Airtel plans to list 500 million pound bond issue on London Exchange | Sakshi
Sakshi News home page

పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ

Nov 14 2015 2:29 AM | Updated on Sep 3 2017 12:26 PM

పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ

పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ

దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ.5,000 కోట్ల(50 కోట్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్) స్టెర్లింగ్ బాండ్‌లను జారీ చేయనున్నది.

బాండ్ల విలువ రూ.5,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ.5,000  కోట్ల(50 కోట్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్) స్టెర్లింగ్ బాండ్‌లను జారీ చేయనున్నది. ఈ బాండ్లను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేస్తామని ఎయిర్‌టెల్ గ్రూప్ కోశాధికారి హర్జిత్ కోహ్లి చెప్పారు. ఈ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తంతో ప్రస్తుతమున్న రుణాలను రీ ఫైనాన్స్ చేస్తామని చెప్పారు.

అంతర్జాతీయంగా రుణ పరిస్థితులు, మార్కెట్ల స్థితిగతులు వంటి అంశాలతో పాటు వివిధ సంస్థల నుంచి అనుమతులు రావల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ బాండ్లు ఎప్పుడు జారీ చేసేదీ వెల్లడిస్తామని  తెలిపారు. ఇప్పటికే డాలర్లు, యూరోలు, క్రోనార్ కరెన్సీల్లో బాండ్లను జారీ చేశామని, ఈ బాండ్‌లను సింగపూర్, ఫ్రాంక్‌ఫర్ట్, స్విట్జర్లాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్ చేశామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement