ముంబై: నైపుణ్యతకు పట్టం అనే నానుడికి భిన్నమైన ధోరణి భారత్లో దర్శనమివ్వబోతోందని ఒక సర్వే పేర్కొంది. లాస్ ఏంజెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘వేతనాల పెరుగుదల’ పేరుతో ఒక సర్వేను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే...
► 2030 నాటికి వేతనాల ఎదుగుదలలేని ఏకైక ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండబోతోంది. దీనికి కారణం దేశంలో నిపుణుల సంఖ్య గణనీయంగా పెరగడమే కావడం గమనార్హం. అవసరమైనదానికంటే నిపుణులైన ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల వారికి వేతనాలు పెరగని పరిస్థితి నెలకొంటుంది.
► ఇతర దేశాల తరహాలో కాకుండా భారత్లో 2030 నాటకి చక్కటి నైపుణ్యం ఉన్న ప్రజల సంఖ్య అధికం అవనుంది.
► ఇక ఆసియా పసిఫిక్సహా ఇతర దేశాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి కనబడుతోంది. నిపుణులకు ఆయా దేశాల్లో వేతనాలు పెరగనున్నాయి. ఆయా దేశాల్లో నిపుణుల కొరత దీనికి కారణం.
► ఇక అంతర్జాతీయంగా చూస్తే... నిపుణులకు లభించనున్న భారీ వేతనాల వల్ల 2030 నాటికి వార్షిక కార్మిక వ్యయం 2.5 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుంది.
►ఉద్యోగ వ్యయాలు భారీగా ఎదుర్కొనే భారీ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా, జర్మనీలూ ఉంటాయి.
► ఒక్క ఆసియా పసిఫిక్ను చూస్తే, 2030 నాటికి వేతనాల పెరుగుదల భారం ట్రిలియన్ డాలర్లకన్నా అధికంగా ఉండనుంది. ఇది కంపెనీలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. బిజినెస్ వ్యూహాలను మార్చుకోకపోతే, మొత్తంగా వ్యాపారాలే ముప్పు ఎదుర్కోవచ్చు.
► మొత్తంగా చూస్తే, ఆయా దేశాల్లో వేతనాల పెంపు ద్రవ్యోల్బణానికి అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. ఇక వేతనాల పెరుగుదల వల్ల తయారీ రంగంపై తీవ్ర ప్రతికూలత పడే వీలుంది. పలు వర్థమాన దేశాల వృద్ధికి ఈ రంగమే ఊతం ఇస్తున్న సంగతి తెలిసిందే.
►ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు డిమాండ్ విషయంలో 2020, 2025, 2030 సంవత్సరాలు కీలక మైలురాళ్లు. భారత్తోపాటు 20 దేశాల్లో ఈ ధోరణి ఉంటుంది. ఫైనాన్షియల్–బిజినెస్ సేవలు, టెక్నాలజీ, మీడియా–టెలికం, తయారీ రంగాల్లో ఉద్యోగాలు భారీగా రానున్నాయి.
నిపుణులు బారెడు.. జీతాలు మూరెడు!
Published Fri, Jun 22 2018 12:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement