ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం | Ysrcp office inaugarated in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం

Apr 11 2017 2:48 AM | Updated on May 29 2018 4:37 PM

ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం - Sakshi

ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం

ఢిల్లీలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది.

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. విఠల్‌భాయ్‌ పటేల్‌ హౌస్‌(వీపీ హౌస్‌)లో కేటాయించిన క్వార్టర్‌లో పూజాకార్యక్రమంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పీవీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మేకపాటి, వరప్రసాదరావు మీడియాతో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement