చినజీయర్‌ స్వామిని కలిసిన వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Meets Chinna Jeeyar Swami - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామిని కలిశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. చినజీయర్‌ స్వామి దివ్య ఆశీస్సులు తీసుకుని, కాసేపు మాట్లాడారు.

గతంలో కూడా చినజీయర్‌ స్వామిని వైఎస్‌ జగన్‌ కలిశారు. వైఎస్‌ జగన్‌ వెంట పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top