తెలంగాణ మట్టిలో కిరణ్ సీమాంధ్ర విత్తనం | you are a seemandhra seed born in telangana, harishrao says to kiran kumar reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ మట్టిలో కిరణ్ సీమాంధ్ర విత్తనం

Jan 10 2014 3:00 PM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణ మట్టిలో కిరణ్ సీమాంధ్ర విత్తనం - Sakshi

తెలంగాణ మట్టిలో కిరణ్ సీమాంధ్ర విత్తనం

శాసనసభ సమావేశాలు ముగియగానే అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.

హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు ముగియగానే అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.  మీరు హైదరాబాద్లో పుట్టానని చెప్పుకుంటున్నారు... తెలంగాణ మట్టిలో సీమాంధ్ర విత్తనం మీరు అని కిరణ్తో హరీష్ రావు అన్నారు. కిరణ్య కుమార్ రెడ్డి సీమాంధ్ర వ్యక్తేనని... ఆయన సీమాంధ్రకే సీఎం అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో పుట్టినంత మాత్రాన సీఎం తెలంగాణ వ్యక్తి కాలేరన్నారు. మట్టి మారినంత  మాత్రాన విత్తనం రూపు మారదని హరీష్ చలోక్తులు విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement