గుంటూరు క్రైం : బయో ఉత్పత్తులను విక్రయించే కోస్టల్ జిల్లాల బ్రాంచి కార్యాలయం గోడౌన్పై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా విక్రయాలు కొనసాగిస్తుండడాన్ని గుర్తించారు. రూ.60 లక్షల విలువచేసే 13రకాల బయో ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసి సీజ్చేశారు. ఆయా ఉత్పత్తుల శాంపిళ్లను సేకరించారు. బెంగళూరులో తయారైన బయో ఉత్పత్తులకు సంబంధించి కోస్తా జిల్లాలకు సిమ్బయాసిస్ ఆగ్రోమేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచి కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో ఉండగా.. ఆర్.అగ్రహారంలో సమీపంలో గోడౌన్ ఉంది. ఈ గోడౌన్లో అక్రమంగా బయోఉత్పత్తులు నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ ఎస్పీ కేవీ మోహన్రావుకు సమాచారం అందడంతో అధికారులను అప్రమత్తం చేశారు. గోడౌన్పై దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నిల్వచేసివున్న వివిధ రకాల బయోఉత్పత్తులను పరిశీలించారు. మొత్తం 40 రకాలు ఉండగా వీటిలో రూ.60 లక్షల విలువచేసే 13 రకాల బయో ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతి లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆయా బయో ఉత్పత్తుల విక్రయాలను నిలుపుదలచేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఏవో కె.వెంకట్రావు మాట్లాడుతూ బయో ఉత్పత్తుల తయారీ జరిగిన అనంతరం తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అనుమతి పొందాల్సివుంటుందని ైహైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను సైతం సదరు కంపెనీ ఉల్లంఘిస్తూ అక్రమ విక్రయాలు కొనసాగిస్తోందన్నారు. సేకరించిన శ్యాంపిళ్లను హైదరబాద్లోని ల్యాబరేటరీకి పంపుతామని, అవి నాణ్యతాలోపంగా ఉన్నాయని తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దాడుల్లో సీఐ ఎ.కిషోర్బాబు, ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ శ్రీరాములు, వ్యవసాయాధికారి పూర్ణచంద్రరావు, కానిస్టేబుళ్లు రమేష్, నాగరాజు పాల్గొన్నారు.
బయో ఉత్పత్తుల గోడౌన్పై విజిలెన్స్ దాడులు
Published Sat, Sep 13 2014 1:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement