రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | two persons dies in road accident at east godhavari district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Jul 21 2015 8:09 AM | Updated on Aug 30 2018 3:56 PM

రెండు బైకులను లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

తూర్పుగోదావరి(తొండంగి): రెండు బైకులను లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై  మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. తొండంగి మండలం బెండపూడికి చెందిన నలుగురు యువకులు రెండు బైకులపై అన్నవరం వైపు వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందినవారు బెండపూడికి చెందిన గోకుశెట్ల నారాయణ, పాపాల రాముగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందకున్న పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement