కారు, టిప్పర్ ఢీ.. ఇద్దరు మృతి | two died in road accident | Sakshi
Sakshi News home page

కారు, టిప్పర్ ఢీ.. ఇద్దరు మృతి

Apr 12 2015 8:27 AM | Updated on Aug 30 2018 3:56 PM

కారు, టిప్పర్ ఢీ.. ఇద్దరు మృతి - Sakshi

కారు, టిప్పర్ ఢీ.. ఇద్దరు మృతి

రాంగ్ రూట్‌లో వస్తున్న టిప్పర్ వాహనం కారును ఢీ కొంది.

ప్రకాశం జిల్లా: రాంగ్ రూట్‌లో వస్తున్న టిప్పర్ వాహనం కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కేంద్రంలో జాతీయరహదారి-16పై జరిగింది. వివరాలు.. చెన్నై నుంచి ఒంగోలు వెళ్తున్న కారును రాంగ్ రూట్‌లో వేగంగా వస్తున్న టిప్పర్ వాహనం ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కృష్ణారావు (45), ఆదాం (50) అక్కడికక్కడే మృతి చెందారు.


మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు కనిగిరికి చెందిన మేస్త్రీలుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(ఉలవపాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement