నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి | Two children die in freak accident | Sakshi
Sakshi News home page

నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Aug 28 2015 6:31 PM | Updated on Apr 4 2019 4:44 PM

నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరులో శుక్రవారం సాయంత్రం జరిగింది.

మైదుకూరు (వైఎస్సార్ జిల్లా) : నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరులో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. మున్సిపాలిటి పరిధిలోని సర్వాయి పల్లి రోడ్డులో నివాసముంటున్న వెంకటేష్(7), రాజేష్(5) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు.. బాత్‌రూం నిర్మించడం కోసం తీసిన గుంతలో పడి మృతిచెందారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement