బొర్రా వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా బొర్రా-కరకవలస స్టేషన్ల మధ్య కొండ చరియలు విరిగిపడ్డాయి.
విశాఖపట్నం: బొర్రా వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా బొర్రా-కరకవలస స్టేషన్ల మధ్య కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కేకే లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విశాఖ-కిరండోల్ 1 వీకే ప్యాసింజర్ రైలు రద్దయింది. ఇక సాంకేతిక కారణాలతో విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా రద్దు చేశారు. విరిగి పడిన కొండచరియలు అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.