రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు | Tirupati MP Balli Durga Prasad Meet HRD Minister | Sakshi
Sakshi News home page

రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు

Dec 14 2019 11:14 AM | Updated on Dec 14 2019 11:14 AM

Tirupati MP Balli Durga Prasad Meet HRD Minister - Sakshi

కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు  

సాక్షి, నాయుడుపేట: తిరుపతిలో పార్లమెంట్‌ పరిధిలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం కేంద్రమానవ వనరులశాఖ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం పాలచ్చూరులో, చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలో రెండు కేంద్రీయ విద్యాలయాలను వచ్చే విద్య సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలో సంబంధిత శాఖ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుకెళ్లి మంజూరుకా కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement