నిజామాబాద్ సిటీ,న్యూస్లైన్ : అందరం ఐకమత్యంతో ఉంటూ ముందుకుసాగితే దేశంలో అన్ని రాష్ట్రాలలోకెల్లా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ప్రత్యేక రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల న్నా రు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పదకొండో డివిజన్లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీవల్లే తెలంగాణ వచ్చిందన్నారు. దీనికి కృషి చేసిన ఆమెకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపేందుకు జెండా పండుగ చేస్తున్నామన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారు ఏ పార్టీ కోసమో,ఏ కులం కోసమో ప్రాణాలు అర్పించలేదన్నారు.
కేవలం తెలంగాణ కోసమే ప్రాణ త్యాగాలు చేశారన్నారు. 1969 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. దీనికి సోనియాగాంధీ ఎంతో బాధపడ్డారన్నారు. ఎన్డీఏ హయాంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ప్రకటించి తెలంగాణను ఏర్పాటు చేయలేదని, దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కారకుడని ఆరోపిం చారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చామని, అలాగే కరీంనగర్ సభలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తాను ఏ హోదాలో ఉన్నా సోనియాను కలిసిన ప్రతి సందర్భంలో తెలంగాణపై మాట్లాడుతూ వచ్చానన్నారు.
తెలంగాణ కోసం ఉద్యోగులు,కార్మికులు,విద్యార్థులు అందరూ పోరాడారన్నారు. అన్ని డివిజన్లలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు రత్నాకర్,సురేందర్,సహాయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్రెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్ జావీద్అక్రం, డీసీసీ ప్రధా న కార్యదర్శి రాజేశ్వర్,యువజన కాంగ్రెస్ జిల్లా,అర్బ న్ అధ్యక్షులు గన్రాజ్,బంటు రాము,ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యతతో ముందుకు సాగుదాం..
Published Wed, Nov 13 2013 6:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
22 మంది బిలియనీర్లయ్యారు
పిడుగుపడి 48 గొర్రెలు మృతి
బీసీలను విస్మరించారు.. ఓటుతో సత్తా చాటుతాం
గెలిచే సీట్లలో నాగర్కర్నూల్ ఒకటి..
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
కాంగ్రెస్తోనే వికలాంగుల సంక్షేమం..
ఎన్నికల విధులపై అవగాహన అవసరం
నేడు కేటీఆర్ రోడ్షో
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement