సచివాలయంలో తెలంగాణ - ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం | telangana and andhra employees clash in secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో తెలంగాణ - ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం

Jun 26 2014 11:49 AM | Updated on Sep 2 2017 9:26 AM

సచివాలయంలో తెలంగాణ - ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం

సచివాలయంలో తెలంగాణ - ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం

సచివాలయంలోని ఎల్ బ్లాక్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య గురువారం ఉదయం వాదోపవాదాలు జరిగాయి.

సచివాలయంలోని ఎల్ బ్లాక్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య గురువారం ఉదయం వాదోపవాదాలు జరిగాయి. ఎల్ బ్లాక్లోని మూడో అంతస్థులో ఉన్న తెలంగాణ ఇంధన శాఖ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని, ఈ బ్లాకును తమకు కేటాయించారని తెలంగాణ ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు చెప్పారు. దీంతో రెండు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య వాదన మొదలైంది.

తెలంగాణ సచివాలయంలో ఇంకా తమ శాఖకు కార్యాలయం ఏదీ కేటాయించలేదని, అందువల్ల తమకు కొంత గడువు కావాలని తెలంగాణ ఉద్యోగులు అన్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అంగీకరించలేదు. రాత్రికి రాత్రే కంచెలు కూడా వేసేసి మరీ తమను పంపేసినప్పుడు.. గడువు గురించి ఆలోచించలేదా అని కొంతమంది ఉద్యోగులు వాదించారు. దాంతో ఈ అంశంపై ఉన్నతాధికారులకు తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement