ఆ తర్వాత తిట్టుకుందాం: ఉండవల్లి | Seemandhra MLAs should oppose Telangana bill in assembly, vundavalli arunkumar | Sakshi
Sakshi News home page

ఆ తర్వాత తిట్టుకుందాం: ఉండవల్లి

Dec 29 2013 12:06 PM | Updated on Jun 2 2018 4:41 PM

ఆ తర్వాత తిట్టుకుందాం: ఉండవల్లి - Sakshi

ఆ తర్వాత తిట్టుకుందాం: ఉండవల్లి

రాష్ట్ర విభజనతో జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలియాలని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజనతో జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలియాలని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం ముక్కలయితే ఆంధ్రా కన్నా తెలంగాణే ఎక్కువ నష్టపోతుందన్నారు. ఏపీ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సమగ్రమైన చర్చ జరగాలన్నారు. చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందన్నారు.

పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో సమైక్యవాదం వివిపించాలన్నారు. ఈ ఇరవై రోజులు ఎంతో కీలకమని అన్నారు. అప్పటివరకు పార్టీల సంగతి మర్చిపోయి సమైక్యవాదం పోరాడదామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మామూలుగా మనం తిట్టుకుందామంటూ ఆయన చమత్కరించారు. బిల్లుపై సమగ్రమైన చర్చ జరిగితే తెలంగాణ ప్రజలు కూడా తమతో కలిసొస్తారని ఉండవల్లి దీమా వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement