ఆర్థికలోటు  రూ.32,390.68 కోట్లు | Revenue expenditure is 20 percent compared to the financial year | Sakshi
Sakshi News home page

ఆర్థికలోటు  రూ.32,390.68 కోట్లు

Feb 6 2019 4:20 AM | Updated on Feb 6 2019 4:20 AM

Revenue expenditure is 20 percent compared to the financial year - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల 2019 –20 సంవత్సరానికి మొత్తం రూ.2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించగా.. ఇందులో రూ.1,80,369.33 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,596.33 కోట్ల క్యాపిటల్‌ వ్యయం ఉంది. రూ.32,390.68 కోట్ల ఆర్థిక లోటు చూపించారు. 2018 –19 బడ్జెట్‌ అంచనాలతో పోల్చితే 2019 – 20 అంచనా మొత్తం రూ.18.38 కోట్ల పెరుగుదల చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వ్యయం 20.03 శాతం, క్యాపిటల్‌ వ్యయం 20.03 శాతం పెరగనుంది. రెవెన్యూ మిగులు రూ.2,099.47 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3.03 శాతం, రెవెన్యూ మిగులు రూ.0.20 శాతం ఉంటుందని అంచనా వేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement