ప్రశాంతంగా ముగిసిన చంద్రగిరి రీపోలింగ్‌

Repolling Completed Peacefully In Chandragiri Constituency - Sakshi

చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదుముదురు ఘటనలు మినహా రీపోలింగ్‌ నిర్వహణ సక్రమంగానే జరిగింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో రిగ్గింగ్‌కు అవకాశం లేకుండాపోయింది. రీపోలింగ్‌ జరిగిన 7 పోలింగ్‌ బూత్‌ల్లో 89.29 శాతం ఓటింగ్‌ జరిగింది. ఏప్రిల్‌ 11న జరిగిన ఓటింగ్‌ కంటే ఈ సారి తక్కువ ఓటింగ్‌ శాతం నమోదైంది. ఏప్రిల్‌ 11న ఈ పోలింగ్‌ బూత్‌లలో 90.42 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23 న వెలువడనున్న సంగతి తెల్సిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top