నడిరోడ్డుపైనే పల్స్‌పోలియో కార్యక్రమం | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపైనే పల్స్‌పోలియో కార్యక్రమం

Published Sun, Jan 17 2016 12:48 PM

Pulse Polio program held in the Middle of a Road

కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులకు నడి రోడ్డుపైనే పోలియో వ్యాక్సిన్లు వేయాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నారులకు పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట్ ప్రాంతంలో ఓ నాలుగు స్కూళ్లలో చిన్నారులకు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. పోలియో నిర్వహించాల్సిన స్కూళ్లు తాళాలు వేసి దర్శనమిచ్చాయి. తమకు ముందుస్తు సమాచారం లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఎవరి నిర్లక్ష్యమైతేనేమి చిన్నారులకు తాళాలు వేసి ఉన్న స్కూళ్ల ముందు ఎండలోనే వ్యాక్సిన్లు వేయాల్సి వచ్చింది.

 

Advertisement
Advertisement