రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన రాష్ట్ర వ్యవసాయ విద్యా మండలి విధివిధానాలపై ముసాయిదా సిద్ధమయ్యింది.
మండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కమిటీ ఇటీవల భేటీ అయి వ్యవసాయ మండలి విధివిధానాలపై ముసాయిదాను తయారు చేసింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, వెటర్నరీ కౌన్సిల్ తరహాలో రాష్ట్ర అగ్రికల్చరల్ కౌన్సిల్ ఉంటుంది. ప్రస్తుత ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఆ తర్వాత గెజిట్ వెలువడుతుంది. దీంతో గత 17 ఏళ్లుగా అమల్లో ఉన్న జీవో నంబర్ 16 తెరమరుగవుతుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న.. ‘భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) అక్రిడిటేషన్ ఉన్న సంస్థల్లో చదివిన వారికే రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు’ అనే నిబంధన రద్దవుతుంది. రాష్ట్ర వ్యవసాయ విద్యా మండలి నిర్ణయాలే చెల్లుబాటవుతాయి. విద్యా సంస్థలపై నియంత్రణ కూడా వ్యవసాయ మండలికే ఉంటుంది.
వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 64 తెచ్చింది. దీంతో తమకు అన్యాయం జరుగుతుందంటూ రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వ్యవసాయ విద్యా మండలి ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మండలి ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలలో చదివిన వారు కూడా మన రాష్ట్రంలో కొన్ని మినహాయింపులతో ఉద్యోగాలు పొందేందుకు అర్హులవుతారని తెలిసింది. ఐసీఏఆర్ చట్టబద్ధమైన సంస్థ కాదని అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యా మండలి ఏర్పాటుకు ముందుకు వచ్చిందని ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడొకరుచెప్పారు.
వీళ్లతో పాటు కమిటీలో వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్శిటీలు, ఐసీఏఆర్, వ్యవసాయ శాఖ నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధులు ఉంటారు. మండలికి ఎంత కాలానికోసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. ప్రస్తుత ముసాయిదా ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఎవరైనా వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. మండలి సభ్యులు ప్రతిపాదిత కళాశాలలో నిబంధనల ప్రకారం భూమి, భవనాలు, ఇతర సౌకర్యాలు, ప్రయోగశాల, బోధనా సిబ్బంది వంటివి ఉన్నాయో లేవో పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. మండలి సిఫారసులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.