► 13 రోజులుగా పోలీసు వలయంలో జిల్లా
► కర్ఫ్యూని తలపించే వాతావరణం
► కాపు ప్రజాప్రతినిధులు, నేతల నిర్బంధాలు
► ఆందోళనకారుల అరెస్టు
► రోడ్లపై బారికే డ్లు, ముళ్లకంచెలతో ఆంక్షలు
► వేలాది మంది పోలీసుల మోహరింపు
► ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజలు
సాక్షి, రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష నేపథ్యంలో 13 రోజులుగా జిల్లా పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. కర్ఫ్యూను తలపించేలా భారీ స్థాయిలో పోలీసులు మోహరింపుతో జనజీవనం స్తంభించింది. తుని ఘటన సందర్భంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్న డిమాండ్తో ఈ నెల 9 నుంచి ముద్రగడ దీక్ష చేపట్టడం, అదే రోజు సాయంత్రం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి బలవంతంగా తరలించడం తెలిసిందే. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. అప్పటినుంచీ రాజమహేంద్ర వరంలో పోలీసు ఆంక్షలు కొనసాగతూండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యమంపై ఉక్కుపాదం...
సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేయడంతో సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు వేలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించింది. ఏపీఎస్పీ, ఏఆర్, సీఆర్పీఎఫ్, సివిల్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన సుమారు ఐదు వేల మంది పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్లపై బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
ముద్రగడకు మద్దతుగా శాంతియుతంగా ర్యాలీలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టిన ఆందోళనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. కాపు నేతలు, యువత బయటికి రాకుండా కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పలువురు కాపునేతలు, ప్రతిపక్ష కాపు నేతలకు గృహనిర్బంధం విధించారు. దీనిని నిరసిస్తూ మహిళలు పిల్లాపాపలతో రోడ్లపైకి వచ్చి ఆందోనలు చేయడంతో పోలీసులకు వారిపై లాఠీచార్జ్ చేశారు. మహిళల స్ఫూర్తితో యువత రోడ్లపైకి వచ్చి ముద్రగడకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
స్తంభించిన జనజీవనం...
ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రోడ్లపై బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడంతో రోజులతరబడి జనజీవనం స్తంభించిపోతోంది. కార్యాలయాలు, ఇళ్లకు వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలతో విసుగెత్తిపోతున్నారు. ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించడంపై మండిపడ్డారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసు వాహనాల సైరన్, మైకుల్లో ప్రచారంతో పోలీసులు హల్చల్ చేస్తున్నారు. దీంతో వ్యాపారాలు లేక వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. రోజూ రాత్రి 10 గంటల వరకూ తెరచి ఉంచే దుకాణాలను ముందుగానే మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
వీడని సంకెళ్లు
Published Wed, Jun 22 2016 1:59 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement